జూలై 10న విద్యాసంస్థల బంద్: ఎస్ఎఫ్ఐ
జూలై 10న విద్యాసంస్థల బంద్: ఎస్ఎఫ్ఐ
K.RAVI
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు పిలుపునిచ్చారు. చౌటుప్పల్లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్న ఆయన.. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్పొరేట్ దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం తేవాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలైన విద్యా భరోసా కార్డులు, ఉచిత ల్యాప్టాప్లను వెంటనే పంపిణీ చేయాలన్నారు. విద్యాసంస్థల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్. మండల ఉపాధ్యక్షులు దోనూరి శ్రావణ్ తిరిగి వరుణ్, మండల నాయకులు పోలేపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి