Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:23 AM

జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ

జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ

జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ
07-07-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.​రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్న ఆయన.. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్పొరేట్ దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం తేవాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలైన విద్యా భరోసా కార్డులు, ఉచిత ల్యాప్‌టాప్‌లను వెంటనే పంపిణీ చేయాలన్నారు. విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్. మండల ఉపాధ్యక్షులు దోనూరి శ్రావణ్ తిరిగి వరుణ్, మండల నాయకులు పోలేపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ

Article Image

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.​రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్న ఆయన.. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్పొరేట్ దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం తేవాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలైన విద్యా భరోసా కార్డులు, ఉచిత ల్యాప్‌టాప్‌లను వెంటనే పంపిణీ చేయాలన్నారు. విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్. మండల ఉపాధ్యక్షులు దోనూరి శ్రావణ్ తిరిగి వరుణ్, మండల నాయకులు పోలేపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News