కుంట్లగూడెం చేనేత సంఘం అభివృద్ధియే ధ్యేయం– చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్
కుంట్లగూడెం చేనేత సంఘం అభివృద్ధియే ధ్యేయం– చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్
K.RAVI
కుంట్లగూడెం చేనేత సహకార సంఘాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆ సంఘ చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కుంట్లగూడెంలో సుదర్శన్ ప్యానెల్ అభ్యర్థులు, చేనేత కార్మికులతో కలిసి బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్యానెల్ గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని కార్మికులను అభ్యర్థించారు.ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ.. జన్మభూమిపై మమకారంతోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అవినీతికి తావులేకుండా నిజాయితీ పాలన అందిస్తానని, ప్రతి చేనేత కార్మికుడికి జియోట్యాగ్ అమలు చేయడంతో పాటు సబ్సిడీపై ముడిసరుకులు అందించి చేతినిండా పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో డైరెక్టర్ అభ్యర్థులు గుండు గోవర్ధన్, భరత్ కుమార్, రాములు, వేణు కుమార్, బాల విటల్, సీతా మధుసూదన్, లక్ష్మి, వేణమ్మ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి