Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 07, 2026 10:37 PM

కుంట్లగూడెం చేనేత సంఘం అభివృద్ధియే ధ్యేయం– చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్

కుంట్లగూడెం చేనేత సంఘం అభివృద్ధియే ధ్యేయం– చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్

కుంట్లగూడెం చేనేత సంఘం అభివృద్ధియే ధ్యేయం– చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్
July 07, 2026 09:04 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కుంట్లగూడెం చేనేత సహకార సంఘాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆ సంఘ చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కుంట్లగూడెంలో సుదర్శన్ ప్యానెల్ అభ్యర్థులు, చేనేత కార్మికులతో కలిసి బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్యానెల్ గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని కార్మికులను అభ్యర్థించారు.​ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ.. జన్మభూమిపై మమకారంతోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అవినీతికి తావులేకుండా నిజాయితీ పాలన అందిస్తానని, ప్రతి చేనేత కార్మికుడికి జియోట్యాగ్ అమలు చేయడంతో పాటు సబ్సిడీపై ముడిసరుకులు అందించి చేతినిండా పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో డైరెక్టర్ అభ్యర్థులు గుండు గోవర్ధన్, భరత్ కుమార్, రాములు, వేణు కుమార్, బాల విటల్, సీతా మధుసూదన్, లక్ష్మి, వేణమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News