PRINT TIME: July 07, 2026 10:37 PM
ఆదోనిలో ఇండోర్ స్టేడియం పనులు పునఃప్రారంభించాలి. సాప్ చైర్మన్ రవి నాయుడికి టీడీపీ యువ నాయకుల వినతి
ఆదోనిలో ఇండోర్ స్టేడియం పనులు పునఃప్రారంభించాలి. సాప్ చైర్మన్ రవి నాయుడికి టీడీపీ యువ నాయకుల వినతి
July 07, 2026 09:19 PM
10 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని, న్యూస్టుడే: ఆదోనిలో నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించడంతో పాటు యువత క్రీడాభివృద్ధికి ఆధునిక క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ యువ నాయకులు మంగళవారం విజయవాడలో సాప్ (SAAP) చైర్మన్ రవి నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆదోని టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆరెకల్ రామకృష్ణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి తదితరులు ఆదోని ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాల అవసరాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపై స్పందించిన రవి నాయుడు, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను పునఃప్రారంభించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని, సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి