Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పూర్తయిన జర్నలిస్టుల ఇళ్లకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్‌కు వినతి నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 07, 2026 07:32 PM

కన్నెపల్లి పంప్‌హౌస్ వెంటనే ప్రారంభించాలి

కన్నెపల్లి పంప్‌హౌస్ వెంటనే ప్రారంభించాలి

కన్నెపల్లి పంప్‌హౌస్ వెంటనే ప్రారంభించాలి
July 07, 2026 05:36 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కలెక్టరేట్ ముట్టడించిన బీఆర్ఎస్, రైతులు

సూర్యాపేట,కన్నెపల్లి పంప్‌హౌస్‌ను తక్షణమే ప్రారంభించి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి ఎండిపోతున్న ఆయకట్టును కాపాడాలని డిమాండ్ చేస్తూ బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ను బీఆర్ఎస్ నాయకులు, రైతులు ముట్టడించారు.

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందన్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం జలాలను సకాలంలో విడుదల చేసి రైతులకు సాగునీరు అందించామని, ప్రస్తుతం రాజకీయ కక్షతోనే కన్నెపల్లి పంప్‌హౌస్ పునరుద్ధరణను ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, వెంటనే పంప్‌హౌస్‌ను ప్రారంభించి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్ ముట్టడితో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అనంతరం బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి గోదావరి జలాలు విడుదల చేయకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News