PRINT TIME: July 07, 2026 07:44 AM
డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి
డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి
July 07, 2026 06:08 AM
0 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
మల్కాపురం ఐటీ పార్క్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోయలగూడెం గ్రామానికి చెందిన అల్మాస్పేట యాదయ్య (53) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదయ్య కూలీ పని నిమిత్తం తన బైక్పై మల్కాపురం వెళ్తుండగా, ఐటీ పార్క్ మెయిన్ గేట్ సమీపంలో ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన యాదయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి