Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:23 AM

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి
07-07-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మల్కాపురం ఐటీ పార్క్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోయలగూడెం గ్రామానికి చెందిన అల్మాస్‌పేట యాదయ్య (53) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదయ్య కూలీ పని నిమిత్తం తన బైక్‌పై మల్కాపురం వెళ్తుండగా, ఐటీ పార్క్ మెయిన్ గేట్ సమీపంలో ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన యాదయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి

Article Image

మల్కాపురం ఐటీ పార్క్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోయలగూడెం గ్రామానికి చెందిన అల్మాస్‌పేట యాదయ్య (53) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదయ్య కూలీ పని నిమిత్తం తన బైక్‌పై మల్కాపురం వెళ్తుండగా, ఐటీ పార్క్ మెయిన్ గేట్ సమీపంలో ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన యాదయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News