Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేపాలలో ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 07, 2026 07:44 AM

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి
July 07, 2026 06:08 AM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మల్కాపురం ఐటీ పార్క్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోయలగూడెం గ్రామానికి చెందిన అల్మాస్‌పేట యాదయ్య (53) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదయ్య కూలీ పని నిమిత్తం తన బైక్‌పై మల్కాపురం వెళ్తుండగా, ఐటీ పార్క్ మెయిన్ గేట్ సమీపంలో ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన యాదయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News