ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలి
ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలి
K.RAVI
నూతనంగా ‘ఆరాధ్య హోటల్’ ప్రారంభం
13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్
ఆహార పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, వినియోగదారుల మన్ననలు పొందాలని చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ సూచించారు. మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డు పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఆరాధ్య హోటల్'ను ఆదివారం ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. హోటళ్లలో ఆహార పదార్థాల తయారీలో రుచితో పాటు శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, స్వచ్ఛమైన ఆహారాన్ని అందించినప్పుడే వ్యాపారాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు. నూతన హోటల్ యజమాని సతీష్కు ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హోటల్ నిర్వాహకులు కౌన్సిలర్ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్లు ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, కొయ్యడ శేఖర్ గౌడ్, కో-ఆప్షన్ మెంబర్ సందగళ్ళ విజయ సతీష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నాయకులు చెవగోని వెంకటేష్ గౌడ్, వర్కాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి