Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 AM

గుండ్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

గుండ్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

గుండ్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
28-06-2026 192 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల, జూన్ 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో ఆదివారం ఉదయం జరిగిన వరుస వాహనాల ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మూడు కార్లు, ఒక బైక్ పరస్పరం ఢీకొన్న ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

మృతులను నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి దేవేందర్ రెడ్డి మరియు దేప సరితగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం పది మంది ప్రయాణికులు ఉన్నట్లు, వారిలో పలువురికి గాయాలైనట్లు తెలిసింది. సడన్ బ్రేక్ వేయడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా, స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Sthanikam

గుండ్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

Article Image


చిట్యాల, జూన్ 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో ఆదివారం ఉదయం జరిగిన వరుస వాహనాల ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మూడు కార్లు, ఒక బైక్ పరస్పరం ఢీకొన్న ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

మృతులను నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి దేవేందర్ రెడ్డి మరియు దేప సరితగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం పది మంది ప్రయాణికులు ఉన్నట్లు, వారిలో పలువురికి గాయాలైనట్లు తెలిసింది. సడన్ బ్రేక్ వేయడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా, స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News