గుండ్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
గుండ్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
Komidala Mahender reddy
చిట్యాల, జూన్ 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో ఆదివారం ఉదయం జరిగిన వరుస వాహనాల ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మూడు కార్లు, ఒక బైక్ పరస్పరం ఢీకొన్న ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
మృతులను నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి దేవేందర్ రెడ్డి మరియు దేప సరితగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం పది మంది ప్రయాణికులు ఉన్నట్లు, వారిలో పలువురికి గాయాలైనట్లు తెలిసింది. సడన్ బ్రేక్ వేయడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా, స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి