PRINT TIME: June 27, 2026 09:36 PM
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం.. సంగారెడ్డిలో అభివృద్ధి పనుల ప్రారంభం
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం.. సంగారెడ్డిలో అభివృద్ధి పనుల ప్రారంభం
June 27, 2026 08:33 PM
47 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు టీజీఐఐసీ సీఎస్ఆర్ నిధుల కింద రూ.5.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో రూ.4 కోట్లతో హాస్టల్, గర్ల్స్ జూనియర్ కాలేజీలో రూ.75 లక్షలతో ఆడిటోరియం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.15 లక్షలతో డైనింగ్ హాల్, కిచెన్, తారా డిగ్రీ కళాశాలలో రూ.50 లక్షలతో ప్రహరీ నిర్మించనున్నారు. ఈ అభివృద్ధి పనులకు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, ప్రజాప్రతినిధులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి