డా. కేశవులు ముదిరాజ్కు ‘గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు’. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే చేతుల మీదుగా సత్కారం
డా. కేశవులు ముదిరాజ్కు ‘గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు’. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే చేతుల మీదుగా సత్కారం
Editor Desk
నల్లగొండ, జూన్ 27: సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్కు ‘గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు’ లభించింది. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో అంబేద్కర్ గ్లోబల్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అంబాసిడర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అవార్డును అందజేశారు.
సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, ఎలక్షన్ వాచ్ కమిటీ ద్వారా ఓటరు చైతన్యం పెంపొందించడం, ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో ఓబీసీ కమిషన్ సభ్యురాలు కిరణ్ మహాలే, కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్, డా. మనీష్ సుకుడే, మెట్టు మధు, నోముల క్రాంతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి