విద్యార్థుల విజయమే లక్ష్యం.. స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్
విద్యార్థుల విజయమే లక్ష్యం.. స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్
Krishna
నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్ మహబూబాబాద్ జిల్లా అనంతారం గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి స్నేహిత్కు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, టెలివిజన్ వంటి వాటికి దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎడ్యుకేషనల్ సభ్యులు రాజేష్, వీరభద్రం, నవీన్, ప్రసాద్, రాజశేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి