Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:52 AM

నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు. శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు. శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు.  శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
27-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను శనివారం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ, ప్రత్యేక ఆహ్వానితురాలు వంగూరి నవ్యశ్రీ రాఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.


డా. శ్రీకాంత్ పెరిక ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించనుంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నామమాత్రపు రుసుములతో ప్రజలకు మెరుగైన స్కానింగ్ సేవలు అందించి విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు.


డా. శ్రీకాంత్ పెరిక మాట్లాడుతూ, న్యూఢిల్లీలో పదేళ్ల అనుభవం అనంతరం స్వస్థలమైన నల్లగొండలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు నాణ్యమైన స్కానింగ్ సేవలు అందిస్తామని తెలిపారు.


కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగిరి లక్ష్మయ్య, డాక్టర్ తల్లిదండ్రులు రూతమ్మ–భీమయ్య, కుటుంబ సభ్యులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు. శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

Article Image

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను శనివారం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ, ప్రత్యేక ఆహ్వానితురాలు వంగూరి నవ్యశ్రీ రాఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.


డా. శ్రీకాంత్ పెరిక ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించనుంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నామమాత్రపు రుసుములతో ప్రజలకు మెరుగైన స్కానింగ్ సేవలు అందించి విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు.


డా. శ్రీకాంత్ పెరిక మాట్లాడుతూ, న్యూఢిల్లీలో పదేళ్ల అనుభవం అనంతరం స్వస్థలమైన నల్లగొండలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు నాణ్యమైన స్కానింగ్ సేవలు అందిస్తామని తెలిపారు.


కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగిరి లక్ష్మయ్య, డాక్టర్ తల్లిదండ్రులు రూతమ్మ–భీమయ్య, కుటుంబ సభ్యులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News