నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు. శ్రీ రూబీ స్కాన్ సెంటర్ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు. శ్రీ రూబీ స్కాన్ సెంటర్ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
Editor Desk
నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రూబీ స్కాన్ సెంటర్ను శనివారం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ, ప్రత్యేక ఆహ్వానితురాలు వంగూరి నవ్యశ్రీ రాఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డా. శ్రీకాంత్ పెరిక ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించనుంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నామమాత్రపు రుసుములతో ప్రజలకు మెరుగైన స్కానింగ్ సేవలు అందించి విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు.
డా. శ్రీకాంత్ పెరిక మాట్లాడుతూ, న్యూఢిల్లీలో పదేళ్ల అనుభవం అనంతరం స్వస్థలమైన నల్లగొండలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు నాణ్యమైన స్కానింగ్ సేవలు అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగిరి లక్ష్మయ్య, డాక్టర్ తల్లిదండ్రులు రూతమ్మ–భీమయ్య, కుటుంబ సభ్యులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి