ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇదే నిదర్శనం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇదే నిదర్శనం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
Krishna
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. నారాయణఖేడ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో అనేంట్ డిజిటల్ సంస్థ అందించిన 10 ల్యాప్టాప్లు, లయన్స్ క్లబ్ హైదరాబాద్ సౌత్ అందించిన 200 భోజన పళ్లాలు, నోట్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తికావడంతో కొత్త ప్రవేశాలు నిలిపివేయడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, అనేంట్ డిజిటల్ సంస్థ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి