Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇదే నిదర్శనం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇదే నిదర్శనం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇదే నిదర్శనం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
27-06-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. నారాయణఖేడ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో అనేంట్ డిజిటల్ సంస్థ అందించిన 10 ల్యాప్‌టాప్‌లు, లయన్స్ క్లబ్ హైదరాబాద్ సౌత్ అందించిన 200 భోజన పళ్లాలు, నోట్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తికావడంతో కొత్త ప్రవేశాలు నిలిపివేయడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, అనేంట్ డిజిటల్ సంస్థ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇదే నిదర్శనం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. నారాయణఖేడ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో అనేంట్ డిజిటల్ సంస్థ అందించిన 10 ల్యాప్‌టాప్‌లు, లయన్స్ క్లబ్ హైదరాబాద్ సౌత్ అందించిన 200 భోజన పళ్లాలు, నోట్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తికావడంతో కొత్త ప్రవేశాలు నిలిపివేయడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, అనేంట్ డిజిటల్ సంస్థ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News