ఛత్రపతి శివాజీ విగ్రహానికి క్షీరాభిషేకం
యువతకు శివాజీ మహారాజ్ స్ఫూర్తి కావాలి : గోగు రవి
హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ గోగు రవి మాట్లాడుతూ, యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకుని దేశం కోసం, ధర్మం కోసం పని చేయాలని కోరారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు యువతకు ఆదర్శమని తెలిపారు. సమాజ హితం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి