Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన సందర్భంగా వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన:నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 08:24 PM

ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం
June 20, 2026 06:04 PM 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

'యోగా' ఆకారంలో విద్యార్థుల ఆసనాల విన్యాసాలు


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ హైస్కూల్‌లో శనివారం విద్యార్థులు ఘనంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కలిసి మైదానంలో 'యోగా' అక్షరాల ఆకారంలో కూర్చొని ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ కే.వి.బి. కృష్ణారావు మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన యోగా విద్యను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానికే దక్కుతుందని ఆయన గర్వంగా కొనియాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచే యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News