Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:09 AM

ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం
20-06-2026 310 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

'యోగా' ఆకారంలో విద్యార్థుల ఆసనాల విన్యాసాలు


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ హైస్కూల్‌లో శనివారం విద్యార్థులు ఘనంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కలిసి మైదానంలో 'యోగా' అక్షరాల ఆకారంలో కూర్చొని ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ కే.వి.బి. కృష్ణారావు మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన యోగా విద్యను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానికే దక్కుతుందని ఆయన గర్వంగా కొనియాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచే యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

Article Image

'యోగా' ఆకారంలో విద్యార్థుల ఆసనాల విన్యాసాలు


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ హైస్కూల్‌లో శనివారం విద్యార్థులు ఘనంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కలిసి మైదానంలో 'యోగా' అక్షరాల ఆకారంలో కూర్చొని ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ కే.వి.బి. కృష్ణారావు మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన యోగా విద్యను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానికే దక్కుతుందని ఆయన గర్వంగా కొనియాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచే యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News