ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం
ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం
K.RAVI
'యోగా' ఆకారంలో విద్యార్థుల ఆసనాల విన్యాసాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ హైస్కూల్లో శనివారం విద్యార్థులు ఘనంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కలిసి మైదానంలో 'యోగా' అక్షరాల ఆకారంలో కూర్చొని ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ కే.వి.బి. కృష్ణారావు మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన యోగా విద్యను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానికే దక్కుతుందని ఆయన గర్వంగా కొనియాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచే యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి