Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన సందర్భంగా వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన:నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 08:54 PM

గాయత్రి మృతిపై మిస్టరీ. భర్త పాత్రపై విచారణ జరపాలంటూ కుటుంబ సభ్యుల డిమాండ్

గాయత్రి మృతిపై మిస్టరీ. భర్త పాత్రపై విచారణ జరపాలంటూ కుటుంబ సభ్యుల డిమాండ్

గాయత్రి మృతిపై మిస్టరీ.  భర్త పాత్రపై విచారణ జరపాలంటూ కుటుంబ సభ్యుల డిమాండ్
June 20, 2026 07:04 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, మసూరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి మరణం పలు ప్రశ్నలకు తావిస్తోందని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా, సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోరారు.


గాయత్రి మరణానికి ముందు వరకు ఆరోగ్యంగానే ఉండేదని, ఘటన జరిగిన తీరుపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భర్త సౌమ్య శ్రీచరణ్ వ్యవహారశైలి, ఘటన అనంతరం ప్రవర్తించిన తీరు అనుమానాలకు కారణమవుతోందని ఆరోపించారు. మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.


సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన గాయత్రి ఉన్నత ఆశయాలతో ముందుకు సాగేదని, యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతోందని తెలిపారు. వైవాహిక జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందులను ఆమె సన్నిహితులతో పంచుకున్నట్లు పేర్కొన్నారు. భర్త నుంచి మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ఆమె చెప్పేదని ఆరోపించారు.


గాయత్రి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు అధికారులు స్పందించాలని కోరారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News