మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారం
మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారం
Vaddeman Suresh
వలిగొండ మండలం లోని వెల్వర్తి గ్రామంలో ఏడు సంవత్సరాల తర్వాత నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికలలో గెలుపొందిన పాలకవర్గానికి ఆదివారం రోజున ఎన్నికల అధికారి కుర్ర సురేష్ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకార మహోత్సవం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో నూతన అధ్యక్షుడిగా బత్తేపు శేఖర్, ఉపాధ్యక్షుడిగా మారబోయిన పరుశురాం, కార్యదర్శిగా సురబోయిన దయాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. డైరెక్టర్లుగా నిమ్మల శేఖర్, దుడ్డు ఆంజనేయులు, బోల్లెబోయిన శేఖర్, మారబోయిన అంజయ్య, దుడ్డు అండాలు, చెవ్వ ఎల్లమ్మలు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించినందుకు సంఘం అభివృద్ధికి శాయశక్తుల కృషి చేసి ముందు వరుసలో నిలుపుతామని వారు తెలియజేశారు.ముదిరాజ్ సమాజ సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత మరియు సభ్యుల హక్కుల పరిరక్షణ కోసం నూతన నాయకత్వం కృషి చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా
"నియంతృత్వ పాలనకు ముగింపు – ప్రజాస్వామ్యానికి పట్టం కట్టిన వెల్వర్తి ముదిరాజ్ ఐక్యత" అనే నినాదంతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రాల రాములు, చెవ్వ కృష్ణ, చెవ్వ బిక్షపతి, మారబోయిన బిక్షపతి, సారగండ్ల రాజు, దుడ్డు రమేష్, కాల్వల లింగస్వామి, చెవ్వ మధు, దాసబోయిన వెంకటేశం, దుడ్డు నవీన్, బొల్లబోయిన మధు, నిమ్మల సురేష్, నిమ్మల నవీన్, దుడ్డు గణేష్, బొల్లబోయిన వంశీ, మారబోయిన అనిల్, సారగండ్ల ఉదయ్ ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి