Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో టీఆర్ఎస్ జోష్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి భారీ చేరికలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 19, 2026 10:17 PM

రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్

రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్

రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్
June 19, 2026 08:44 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: భూమి సర్వే నివేదిక జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న జి. పవన్‌కుమార్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు కలెక్టరేట్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు చెందిన భూముల సర్వే నివేదిక ఇవ్వడానికి రూ.35 వేల లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా బాధితుడు ఇప్పటికే రూ.20 వేలు చెల్లించగా, మిగిలిన రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.


నిందితుడిపై కేసు నమోదు చేసి, నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన కలెక్టరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News