PRINT TIME: June 19, 2026 10:17 PM
రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్స్పెక్టర్
రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్స్పెక్టర్
June 19, 2026 08:44 PM
41 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ,: భూమి సర్వే నివేదిక జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న జి. పవన్కుమార్ను శుక్రవారం ఏసీబీ అధికారులు కలెక్టరేట్ వద్ద రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు చెందిన భూముల సర్వే నివేదిక ఇవ్వడానికి రూ.35 వేల లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా బాధితుడు ఇప్పటికే రూ.20 వేలు చెల్లించగా, మిగిలిన రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి, నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన కలెక్టరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి