చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు
చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు
K.RAVI
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై ఎస్. కృష్ణ మాస్ తన సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో గ్రామంలోని ఒక కిరాణా షాపుపై దాడి నిర్వహించారు.గ్రామానికి చెందిన ఎస్కే హాజరత్ (48, తండ్రి: షేక్ లాలూ మహమ్మద్) అనే వ్యక్తి కిరాణా షాప్ నడుపుతున్నాడు. అతను వైన్ షాప్ నుండి మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి తీసుకురాగా, అతని భార్య సైదాబీ వాటిని కిరాణా షాపులో అక్రమంగా అమ్ముతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.పోలీసులు సదరు కిరాణా షాప్ నుండి 09 ఆర్సి (RC) బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. చట్టవిరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి