Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 AM

చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు

చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు

చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు
19-06-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై ఎస్. కృష్ణ మాస్ తన సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో గ్రామంలోని ఒక కిరాణా షాపుపై దాడి నిర్వహించారు.​​గ్రామానికి చెందిన ఎస్కే హాజరత్ (48, తండ్రి: షేక్ లాలూ మహమ్మద్) అనే వ్యక్తి కిరాణా షాప్ నడుపుతున్నాడు. అతను వైన్ షాప్ నుండి మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి తీసుకురాగా, అతని భార్య సైదాబీ వాటిని కిరాణా షాపులో అక్రమంగా అమ్ముతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.పోలీసులు సదరు కిరాణా షాప్ నుండి 09 ఆర్‌సి (RC) బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.​ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. చట్టవిరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Sthanikam

చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు

Article Image

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై ఎస్. కృష్ణ మాస్ తన సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో గ్రామంలోని ఒక కిరాణా షాపుపై దాడి నిర్వహించారు.​​గ్రామానికి చెందిన ఎస్కే హాజరత్ (48, తండ్రి: షేక్ లాలూ మహమ్మద్) అనే వ్యక్తి కిరాణా షాప్ నడుపుతున్నాడు. అతను వైన్ షాప్ నుండి మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి తీసుకురాగా, అతని భార్య సైదాబీ వాటిని కిరాణా షాపులో అక్రమంగా అమ్ముతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.పోలీసులు సదరు కిరాణా షాప్ నుండి 09 ఆర్‌సి (RC) బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.​ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. చట్టవిరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News