Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 19, 2026 03:10 AM

చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు

చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు

చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు
June 19, 2026 01:35 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై ఎస్. కృష్ణ మాస్ తన సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో గ్రామంలోని ఒక కిరాణా షాపుపై దాడి నిర్వహించారు.​​గ్రామానికి చెందిన ఎస్కే హాజరత్ (48, తండ్రి: షేక్ లాలూ మహమ్మద్) అనే వ్యక్తి కిరాణా షాప్ నడుపుతున్నాడు. అతను వైన్ షాప్ నుండి మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి తీసుకురాగా, అతని భార్య సైదాబీ వాటిని కిరాణా షాపులో అక్రమంగా అమ్ముతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.పోలీసులు సదరు కిరాణా షాప్ నుండి 09 ఆర్‌సి (RC) బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.​ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. చట్టవిరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News