Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్యాన్సర్ చికిత్సలో “హైపర్ సైట్” టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 18, 2026 07:23 PM

విద్యార్థులు ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.

విద్యార్థులు ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.

విద్యార్థులు ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.
June 18, 2026 04:07 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాహత్ ఖాన్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్న–అక్క మెంటర్‌షిప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రెండు రోజుల డిజిటల్ లెర్నింగ్ శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిక్షణ ద్వారా నేర్చుకున్న ఏఐ పరిజ్ఞానాన్ని కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు చేరవేసి అవగాహన కల్పించాలని సూచించారు. విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అధ్యాపకుడు డాక్టర్ జనార్దన్ రెండు రోజుల పాటు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ వినియోగంపై శిక్షణ అందించారు.

కార్యక్రమానికి డాక్టర్ జె. చినబాబు, డాక్టర్ సీహెచ్. వెంకటేశ్వర్లు, డాక్టర్ జి. సునీత నోడల్ అధికారులుగా వ్యవహరించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డాక్టర్ జి. కిషన్, డాక్టర్ పి. బ్రహ్మం, డాక్టర్ ఎం. రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News