ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా గ్రామీణ ప్రాంత కౌమార బాలికలకు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం.
ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా గ్రామీణ ప్రాంత కౌమార బాలికలకు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం.
Harish K
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శానిటరీ ఫ్యాట్స్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు.
సబ్బండ వర్గాల సంక్షేమమే పద్మమ్మ ధ్యేయం.
ఆడపిల్ల చదవాలి ఎదగాలన్నది పద్మమ్మ పంతం.
మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు.
కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన సందర్భంగా కోదాడలోని బాలికల పాఠశాలలో విద్యార్థినిలకు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుమారు 200 మంది విద్యార్థినిలకు శానిటరీ ఫ్యాట్స్, సబ్బులు, నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి మహిళా అభ్యున్నతికి ఎంతో తోడ్పడుతున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని ఆడపిల్లలకు ఆరోగ్యం, విద్య రెండు కళ్ళు లాంటివని, ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి చదువు అందుతుందని, ఆడపిల్ల చదువు ఆ తరానికి దిక్సూచి లాంటిదని, వారు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అనారోగ్యం పాలు కాకుండా హాజరు శాతం పెరుగుతుందని తద్వారా మంచి చదువు చదువుకునే అవకాశం ఉందని అన్నారు. పద్మావతి ఇంకా మంచి స్థాయిలో ఉన్నత పదవులు అధిరోహించాలని దేవుడు నిండు నూరేళ్లు ఆశీర్వదించి ఈ ప్రాంత అభివృద్ధి కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకునే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమ నాయకులు రాయపూడి వెంకటనారాయణ, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి