ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్ఐ’ ధర్నా
ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్ఐ’ ధర్నా
K.RAVI
ప్రైవేటు స్కూళ్లకు కొమ్ముకాస్తున్న ఎంఈఓను సస్పెండ్ చేయాలి
నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తున్న ట్రినిటీ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్టేషనరీ పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుండి రూ.15 వేల నుండి రూ.35 వేల వరకు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకున్న విద్యార్థి నాయకులపై పోలీసులు దాడి చేయడం సరికాదన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ముకాస్తున్న మండల విద్యాధికారి ని తక్షణమే సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి సాతిరి మనోజ్, మండల ఉపాధ్యక్షులు ఇరిగి వరుణ్, మండల నాయకులు సాయి, గణేష్, సాయి, నాని తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి