Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్‌ఐ’ ధర్నా ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 09:00 PM

ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్‌ఐ’ ధర్నా

ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్‌ఐ’ ధర్నా

ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్‌ఐ’ ధర్నా
June 17, 2026 07:22 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రైవేటు స్కూళ్లకు కొమ్ముకాస్తున్న ఎంఈఓను సస్పెండ్ చేయాలి

నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తున్న ట్రినిటీ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్టేషనరీ పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుండి రూ.15 వేల నుండి రూ.35 వేల వరకు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకున్న విద్యార్థి నాయకులపై పోలీసులు దాడి చేయడం సరికాదన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ముకాస్తున్న మండల విద్యాధికారి ని తక్షణమే సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి సాతిరి మనోజ్, మండల ఉపాధ్యక్షులు ఇరిగి వరుణ్, మండల నాయకులు సాయి, గణేష్, సాయి, నాని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News