ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటన ముగించుకుని రహదారి మార్గంలో విజయవాడకు వెళ్తూ సూర్యాపేటలో కాసేపు ఆగారు. ఆయన ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు అంజనపురి కూడలి వద్ద భారీగా చేరుకున్నారు.
అభిమానుల సందడి, జైకొట్టే నినాదాలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అభిమానుల ప్రేమాభిమానాలను గమనించిన పవన్ కళ్యాణ్ తన వాహనాల బృందాన్ని ఆపించి అభిమానులకు అభివాదం చేశారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం అభిమానులకు చేతులు ఊపుతూ విజయవాడ వైపు బయలుదేరి వెళ్లారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి