వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట
వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట
Harish K
శ్రీ వరవర రంగనాయక స్వామి దేవస్థానం భూముల కౌలు బహిరంగ వేలం పాటను బుధవారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని దేవాలయ ప్రాంగణంలో 2026-27 సంవత్సరమునకు కౌలు పాటలు దేవాలయ చైర్మన్ వరహాల రెడ్డి, గ్రామ పెద్దలు, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో కౌలు రైతులు సర్వే నెం. 361, 362 ఆరు ఎకరాల ఆరుకుంటల ఎర్రవరం గ్రామ శివారులో భూమిని పిలుట్ల సంధ్య ఒక లక్ష 30 వేల రూపాయలకు పాట పాడి దక్కించుకున్నారు దేవాలయ ప్రక్కన ఉన్న 16 ఎకరాల భూమి వేలంపాట గతం కంటే కౌలు తక్కువ రావడంతో పాట వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ కార్య నిర్వహణ అధికారి తుమ్మల వెంకట చలపతి, మేళ్లచెరువు శివాలయ కార్య నిర్వహణ అధికారి శంబిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస రెడ్డీ, వెంకటేశ్వర్లు, కాసాని శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, గ్రామ రైతులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి