ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
K.RAVI
ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు
ఈ నెల 22 వరకు గడువు
ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి వెల్లడి
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామ పరిధిలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కళాశాలలోని సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అర్హత కలిగిన స్థానిక విద్యార్థులు ఈనెల 22వ తేదీ లోపు అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని, అర్హులైన వారంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరింత సమాచారం కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి