Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్‌ఐ’ ధర్నా ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 09:00 PM

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
June 17, 2026 07:22 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు

ఈ నెల 22 వరకు గడువు

​ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి వెల్లడి

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామ పరిధిలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

​కళాశాలలోని సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అర్హత కలిగిన స్థానిక విద్యార్థులు ఈనెల 22వ తేదీ లోపు అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని, అర్హులైన వారంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరింత సమాచారం కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News