విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగుల పంపిణీ
విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగుల పంపిణీ
Editor Desk
హయత్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హయత్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం పి.ఇందిరా, ఎంపీపీఎస్ హెచ్ఎం దయాల్రెడ్డి అన్నారు. జోయాలుకాస్ వనస్థలిపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జాయ్ ఆఫ్ స్కూల్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం 100 మంది విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగుల కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు సహకరించడం అభినందనీయమన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జోయాలుకాస్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థులు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
కార్యక్రమంలో వనస్థలిపురం జెడ్పీహెచ్ఎస్ రిటైర్డ్ జీహెచ్ఎం ఎల్. రవీందర్, జోయాలుకాస్ బ్రాంచ్ మేనేజర్ షరీఫ్, కోటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి