Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:51 AM

విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ

విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ

విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ
17-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పి.ఇందిరా, ఎంపీపీఎస్ హెచ్‌ఎం దయాల్‌రెడ్డి అన్నారు. జోయాలుకాస్ వనస్థలిపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జాయ్ ఆఫ్ స్కూల్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం 100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగుల కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు సహకరించడం అభినందనీయమన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జోయాలుకాస్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థులు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

కార్యక్రమంలో వనస్థలిపురం జెడ్పీహెచ్‌ఎస్ రిటైర్డ్ జీహెచ్‌ఎం ఎల్. రవీందర్, జోయాలుకాస్ బ్రాంచ్ మేనేజర్ షరీఫ్, కోటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ

Article Image

హయత్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పి.ఇందిరా, ఎంపీపీఎస్ హెచ్‌ఎం దయాల్‌రెడ్డి అన్నారు. జోయాలుకాస్ వనస్థలిపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జాయ్ ఆఫ్ స్కూల్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం 100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగుల కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు సహకరించడం అభినందనీయమన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జోయాలుకాస్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థులు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

కార్యక్రమంలో వనస్థలిపురం జెడ్పీహెచ్‌ఎస్ రిటైర్డ్ జీహెచ్‌ఎం ఎల్. రవీందర్, జోయాలుకాస్ బ్రాంచ్ మేనేజర్ షరీఫ్, కోటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News