Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్‌ఐ’ ధర్నా ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 09:00 PM

విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ

విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ

విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ
June 17, 2026 07:13 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పి.ఇందిరా, ఎంపీపీఎస్ హెచ్‌ఎం దయాల్‌రెడ్డి అన్నారు. జోయాలుకాస్ వనస్థలిపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జాయ్ ఆఫ్ స్కూల్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం 100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగుల కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు సహకరించడం అభినందనీయమన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జోయాలుకాస్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థులు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

కార్యక్రమంలో వనస్థలిపురం జెడ్పీహెచ్‌ఎస్ రిటైర్డ్ జీహెచ్‌ఎం ఎల్. రవీందర్, జోయాలుకాస్ బ్రాంచ్ మేనేజర్ షరీఫ్, కోటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News