ప్రజల భద్రత కోసం.బాధ్యతతో ముందుకు సాగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్
ప్రజల భద్రత కోసం.బాధ్యతతో ముందుకు సాగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్
Anjali
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అవసరమైన పరికరాలను పంపిణీ చేసి, విధి నిర్వహణలో పాటించాల్సిన ముఖ్య సూచనలు అందించారు.
విధుల్లో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని అత్యవసర అవసరాలకే పరిమితం చేయాలని, వ్యక్తిగత అవసరాలు లేదా సోషల్ మీడియా వినియోగం విధులపై ప్రభావం చూపడమే కాకుండా పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశముందని సూచించారు.యూనిఫాంలో ఉన్న ప్రతి పోలీసు ప్రజల పరిశీలనలో ఉంటారని, అందువల్ల ప్రవర్తనలోనూ, విధి నిర్వహణలోనూ అత్యంత బాధ్యత, అప్రమత్తత, నిబద్ధతతో వ్యవహరించాలని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల ప్రారంభం మరియు ముగింపు సమయాలు, రద్దీ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసుల సేవలను జిల్లా ఎస్పీ అభినందించారు. రహదారులపై క్రమశిక్షణ, భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ట్రాఫిక్ పోలీసుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి