Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్‌ఐ’ ధర్నా ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 08:51 PM

ప్రజాసేవలో ఆమెకు సాటి ఎవరూ లేరు

ప్రజాసేవలో ఆమెకు సాటి ఎవరూ లేరు

ప్రజాసేవలో ఆమెకు సాటి ఎవరూ లేరు
June 17, 2026 06:51 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం పద్మావతి రెడ్డి.


కోదాడ నియోజకవర్గం లో రూ.1938 కోట్ల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రధాత.


భాషబోయిన భాస్కర రావు


కాంగ్రెస్ నాయకులు బాషబోయిన భాస్కర్ రావు ఆధ్వర్యంలో స్థానిక శాసన సభ్యురాలు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ

ప్రజాసేవను పరమావధిగా భావిస్తూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆమె చూపుతున్న చొరవ, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఆమెను ప్రత్యేక నాయకురాలిగా నిలబెట్టాయని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు రూ.1938 కోట్ల నిధులను తీసుకువచ్చి రహదారులు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రదాతగా పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలిచారని తెలిపారు.కోదాడ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆమె చేపడుతున్న కృషి మరింత విజయవంతం కావాలని, భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 500 మందికి కేకు పులిహోర అందజేశారు. ఈ కార్యక్రమంలో పంది తిరుపతయ్య, రాయపూడి వెంకటనారాయణ, హనుమంతరావు, కాంపాటి శ్రీనివాసరావు, తాటికొండ నాగిరెడ్డి, లక్ష్మీనారాయణ, మహమ్మద్ రఫీ, మైకు నాగులు, కొరివి రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News