Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వేరోస్ గ్రామ కమిటీ ఎన్నిక ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 11:23 PM

రామన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పున్న జగన్ మోహన్ నియామకం

రామన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పున్న జగన్ మోహన్ నియామకం

రామన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పున్న జగన్ మోహన్ నియామకం
June 17, 2026 09:19 PM 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పున్న జగన్ మోహన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది.

టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్యతో సంప్రదించి ఈ నియామకాన్ని ఆమోదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

పార్టీని గ్రామీణ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నూతన అధ్యక్షుడు పున్న జగన్ మోహన్‌కు పార్టీ నాయకత్వం సూచించింది.

ఈ సందర్భంగా పున్న జగన్ మోహన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News