: యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పున్న జగన్ మోహన్ను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది.
టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్యతో సంప్రదించి ఈ నియామకాన్ని ఆమోదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
పార్టీని గ్రామీణ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నూతన అధ్యక్షుడు పున్న జగన్ మోహన్కు పార్టీ నాయకత్వం సూచించింది.
ఈ సందర్భంగా పున్న జగన్ మోహన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి