Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ ​

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ ​

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ ​
17-06-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని సమాచార హక్కు రక్షణ చట్టం-2005 యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ కోరారు. చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన ఆయన.. బుధవారం తన కుమారుడు దబ్బటి అభిమన్యును స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.​ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. నేటి రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుజాత, శ్రీవాణి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ ​

Article Image

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని సమాచార హక్కు రక్షణ చట్టం-2005 యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ కోరారు. చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన ఆయన.. బుధవారం తన కుమారుడు దబ్బటి అభిమన్యును స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.​ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. నేటి రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుజాత, శ్రీవాణి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News