ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్
ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్
K.RAVI
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని సమాచార హక్కు రక్షణ చట్టం-2005 యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ కోరారు. చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన ఆయన.. బుధవారం తన కుమారుడు దబ్బటి అభిమన్యును స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. నేటి రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుజాత, శ్రీవాణి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి