Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 19, 2026 02:17 PM

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ ​

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ ​

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ ​
June 17, 2026 10:57 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని సమాచార హక్కు రక్షణ చట్టం-2005 యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ కోరారు. చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన ఆయన.. బుధవారం తన కుమారుడు దబ్బటి అభిమన్యును స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.​ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. నేటి రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుజాత, శ్రీవాణి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News