PRINT TIME: June 18, 2026 02:18 PM
ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు ఫిర్యాదు
ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు ఫిర్యాదు
June 18, 2026 11:52 AM
23 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
*నిబంధనలు ఉల్లంఘిస్తున్న చౌటుప్పల్ మండల పరిధిలోని స్కూళ్ళు
*చర్యలు తీసుకోవాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ డిమాండ్
చౌటుప్పల్ మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ (IAS) కు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.చౌటుప్పల్లోని ట్రినిటీ, అన్నా మెమోరియల్, కృష్ణవేణి, శ్రీ చైతన్య, నారాయణ తదితర పాఠశాలలు విద్యా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "విద్య అనేది హక్కు, వ్యాపారం కాదు" అని, తక్షణమే ఈ స్కూళ్లపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను, తల్లిదండ్రులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి