చర్లపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు ధ్వంసం,
చర్లపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు ధ్వంసం,
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా చర్లపల్లి వద్ద కెసీఆర్ పార్క్ సమీపంలోని స్మశానవాటిక వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో లారీ డివైడర్ దాటి రోడ్డుపై బోల్తా పడింది.
అదే సమయంలో రహదారి పక్కన ఇటుకల లారీ నుంచి ఇటుకలను దింపుతున్న మరో లారీ నిలిచి ఉండగా, చర్లపల్లి వైపు వెళ్తున్న మినీ డీసీఎం వాహనం ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ఘటనలో మినీ డీసీఎం వాహనం ముందుభాగంలోని క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది.
అయితే ప్రమాద తీవ్రతకు విరుద్ధంగా మూడు వాహనాల్లో ఉన్న డ్రైవర్లు, సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఇటుకలు దింపుతున్న కూలీలకు స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. వారికి స్థానికంగా చికిత్స అందించినట్లు సమాచారం.
ఒకేసారి రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి