Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:23 AM

చర్లపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు ధ్వంసం,

చర్లపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు ధ్వంసం,

చర్లపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు ధ్వంసం,
18-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చర్లపల్లి వద్ద కెసీఆర్ పార్క్ సమీపంలోని స్మశానవాటిక వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో లారీ డివైడర్ దాటి రోడ్డుపై బోల్తా పడింది.

అదే సమయంలో రహదారి పక్కన ఇటుకల లారీ నుంచి ఇటుకలను దింపుతున్న మరో లారీ నిలిచి ఉండగా, చర్లపల్లి వైపు వెళ్తున్న మినీ డీసీఎం వాహనం ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ఘటనలో మినీ డీసీఎం వాహనం ముందుభాగంలోని క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది.

అయితే ప్రమాద తీవ్రతకు విరుద్ధంగా మూడు వాహనాల్లో ఉన్న డ్రైవర్లు, సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఇటుకలు దింపుతున్న కూలీలకు స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. వారికి స్థానికంగా చికిత్స అందించినట్లు సమాచారం.

ఒకేసారి రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Sthanikam

చర్లపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు ధ్వంసం,

Article Image

నల్లగొండ జిల్లా చర్లపల్లి వద్ద కెసీఆర్ పార్క్ సమీపంలోని స్మశానవాటిక వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో లారీ డివైడర్ దాటి రోడ్డుపై బోల్తా పడింది.

అదే సమయంలో రహదారి పక్కన ఇటుకల లారీ నుంచి ఇటుకలను దింపుతున్న మరో లారీ నిలిచి ఉండగా, చర్లపల్లి వైపు వెళ్తున్న మినీ డీసీఎం వాహనం ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ఘటనలో మినీ డీసీఎం వాహనం ముందుభాగంలోని క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది.

అయితే ప్రమాద తీవ్రతకు విరుద్ధంగా మూడు వాహనాల్లో ఉన్న డ్రైవర్లు, సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఇటుకలు దింపుతున్న కూలీలకు స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. వారికి స్థానికంగా చికిత్స అందించినట్లు సమాచారం.

ఒకేసారి రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News