చిట్యాల, జూన్ 18: చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామాన్ని గురువారం జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) శంకర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామ ప్రజాప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వివరించారు.
సమస్యలను శ్రద్ధగా విన్న శంకర్ నాయక్ వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉప సర్పంచ్ జుంజి రాజు, ఎంపీఓ కోటేష్, వార్డు సభ్యుడు నందిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి