Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్యాన్సర్ చికిత్సలో “హైపర్ సైట్” టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 18, 2026 07:18 PM

ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై చర్యలు కోరిన బీసీ విద్యార్థి సంఘం

ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై చర్యలు కోరిన బీసీ విద్యార్థి సంఘం

ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై చర్యలు కోరిన బీసీ విద్యార్థి సంఘం
June 18, 2026 04:33 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రైవేట్ పాఠశాలల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులపై జరుగుతున్న ఫీజులు, పుస్తకాల దోపిడీని వెంటనే అరికట్టాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా డీఈవో బిక్షపతికి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బుక్ ఫీజు, బస్సు ఫీజు, ట్యూషన్ ఫీజు, డొనేషన్ పేర్లతో ప్రైవేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నాయని ఆరోపించారు.

పాఠశాలల్లో పుస్తకాల విక్రయాన్ని నిషేధించినప్పటికీ అనేక సంస్థలు నిబంధనలను బేఖాతరు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న, అనుమతులు లేని, భవన భద్రత, ఫైర్ సేఫ్టీ, శానిటేషన్ ప్రమాణాలు పాటించని పాఠశాలలను గుర్తించి సీజ్ చేయాలని కోరారు. టెట్ అర్హత లేని ఉపాధ్యాయులను తొలగించడంతో పాటు ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు వెళ్లే విద్యార్థులకు టీసీల విషయంలో ఇబ్బందులు కల్పిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డీఈవోను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త నిమ్మల వీరన్న, ఎడ్ల మహాలింగం, ధరావత్ గిరిధర్, సందీప్, రాకేష్, అజయ్, అఖిల్, యుగంధర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News