Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:33 PM

పచ్చదనమే భవిష్యత్‌.. మొక్కల సంరక్షణకు ముందుకురావాలి. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ. ఎమ్మెల్యే వేముల వీరేశం

పచ్చదనమే భవిష్యత్‌.. మొక్కల సంరక్షణకు ముందుకురావాలి. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ. ఎమ్మెల్యే వేముల వీరేశం

పచ్చదనమే భవిష్యత్‌.. మొక్కల సంరక్షణకు ముందుకురావాలి.  రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ.   ఎమ్మెల్యే వేముల వీరేశం
19-06-2026 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మొక్కల పెంపకం, సంరక్షణలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలో మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడం అంతకంటే ముఖ్యమైనది. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా తీసుకోవాలి’’ అని అన్నారు.అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి, విద్యే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Sthanikam

పచ్చదనమే భవిష్యత్‌.. మొక్కల సంరక్షణకు ముందుకురావాలి. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ. ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మొక్కల పెంపకం, సంరక్షణలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలో మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడం అంతకంటే ముఖ్యమైనది. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా తీసుకోవాలి’’ అని అన్నారు.అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి, విద్యే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News