Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
From Classrooms to AI Labs: GDC Hayathnagar Launches Digital Learning Internship 100 Students Trained in Artificial Intelligence and Future-Ready Skil ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 19, 2026 05:29 PM

పచ్చదనమే భవిష్యత్‌.. మొక్కల సంరక్షణకు ముందుకురావాలి. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ. ఎమ్మెల్యే వేముల వీరేశం

పచ్చదనమే భవిష్యత్‌.. మొక్కల సంరక్షణకు ముందుకురావాలి. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ. ఎమ్మెల్యే వేముల వీరేశం

పచ్చదనమే భవిష్యత్‌.. మొక్కల సంరక్షణకు ముందుకురావాలి.  రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ.   ఎమ్మెల్యే వేముల వీరేశం
June 19, 2026 02:47 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మొక్కల పెంపకం, సంరక్షణలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలో మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడం అంతకంటే ముఖ్యమైనది. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా తీసుకోవాలి’’ అని అన్నారు.అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి, విద్యే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News