ఏఐ–డిజిటల్ లెర్నింగ్పై జీడీసీ.హయత్నగర్లో ఇంటర్న్షిప్ విద్యార్థులకు భవిష్యత్ నైపుణ్యాలపై శిక్షణ
ఏఐ–డిజిటల్ లెర్నింగ్పై జీడీసీ.హయత్నగర్లో ఇంటర్న్షిప్ విద్యార్థులకు భవిష్యత్ నైపుణ్యాలపై శిక్షణ
Editor Desk
హయత్నగర్,: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ లెర్నింగ్ రంగాల్లో విద్యార్థులు, అధ్యాపకులను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జీడీసీ) హయత్నగర్లో రెండు రోజుల టీచింగ్ ఇంటర్న్షిప్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ కాలేజియేట్ విద్యా కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అన్న–అక్క మెంటార్షిప్/ఇంటర్న్షిప్’ కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ జరుగుతోంది.
‘డిజిటల్ భవిష్యత్తు కోసం ఏఐ ద్వారా విద్యావేత్తలను సాధికారపరచడం’ అనే అంశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఉప ప్రిన్సిపాల్ వి. ఇందిర మాట్లాడుతూ ప్రస్తుత ఉద్యోగ విపణిలో డిజిటల్ నైపుణ్యాల ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని, విద్యార్థులు ఏఐ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డా. పి. బిక్షపతి మాస్టర్ ట్రైనర్గా వ్యవహరిస్తూ ఏఐ టూల్స్, స్మార్ట్ క్లాస్రూమ్ విధానాలు, స్వయం–ఎన్పీటీఈఎల్ ఆన్లైన్ వనరులు, ఏఐ ఆధారిత మూల్యాంకన పద్ధతులపై శిక్షణ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. సురేష్ బాబు మాట్లాడుతూ, ‘‘ఏఐ భవిష్యత్ సాంకేతికత మాత్రమే కాదు.. నేటి అవసరం కూడా’’ అని పేర్కొన్నారు. విద్యార్థులు నైతిక విలువలను పాటిస్తూ ఏఐ వినియోగంతో తమ విద్యా, బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు.
జూన్ 18 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అన్న–అక్క’ కార్యక్రమంలో భాగంగా జీడీసీ హయత్నగర్లో ఐదో సెమిస్టర్కు చెందిన 100 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి అకడమిక్ క్రెడిట్లు, సర్టిఫికెట్లు అందజేయనున్నారు.
కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధు, డాక్టర్ శేఖర్, డాక్టర్ మక్ల, డాక్టర్ యాదగిరి, డాక్టర్ అవేస్, డాక్టర్ దుర్గాప్రసాద్, రజిత, మమత, ఉమారాణి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి