Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
From Classrooms to AI Labs: GDC Hayathnagar Launches Digital Learning Internship 100 Students Trained in Artificial Intelligence and Future-Ready Skil ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 19, 2026 05:40 PM

మోదీ 12 ఏళ్ల పాలనతో దేశం అభివృద్ధి బాటలో ఇంద్రపాలనగరంలో బీజేపీ నాయకుల విశ్లేషణ

మోదీ 12 ఏళ్ల పాలనతో దేశం అభివృద్ధి బాటలో ఇంద్రపాలనగరంలో బీజేపీ నాయకుల విశ్లేషణ

మోదీ 12 ఏళ్ల పాలనతో దేశం అభివృద్ధి బాటలో ఇంద్రపాలనగరంలో బీజేపీ నాయకుల విశ్లేషణ
June 19, 2026 03:15 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ అగ్రదేశాల సరసన నిలుస్తోందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మోదీ ప్రధాని పదవిలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.

జిల్లా కౌన్సిల్ సభ్యుడు పల్లపు దుర్గయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, నకిరేకల్ ఇంచార్జి నకిరేకంటి మొగులయ్య, మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అట్టడుగు వర్గాలకు చేరవేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందన్నారు. గ్రామపంచాయతీలకు నిధుల కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, రవాణా, రక్షణ రంగాల్లో కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని వివరించారు.

అవినీతి రహిత పాలన, పారదర్శక విధానాలతో భారతదేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా పెంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని కొనియాడారు.

కార్యక్రమంలో వార్డు సభ్యురాలు రేపాక పారిజాత, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు శివగల, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మల్లయ్య, గుడిగంట రామలింగం, నర్సోజు చంద్రయ్య, భువనగిరి మధు, శంకర్, సైదులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News