హయత్నగర్ సీఐగా శంకరయ్య.
హయత్నగర్ సీఐగా శంకరయ్య.
Editor Desk
హయత్నగర్ పోలీస్స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా శంకరయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్న పల్సా నాగరాజ్ గౌడ్ను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో మల్కాజిగిరి కమిషనరేట్ సీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న శంకరయ్యను హయత్నగర్కు బదిలీ చేయగా, ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం శంకరయ్య మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళల భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
నూతన సీఐ బాధ్యతలు చేపట్టడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి