కక్కిరేణిలో విద్య, వైద్యం, మౌలిక వసతులపై సీపీఎం సర్వే. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవన్న జల్లెల పెంటయ్య
కక్కిరేణిలో విద్య, వైద్యం, మౌలిక వసతులపై సీపీఎం సర్వే. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవన్న జల్లెల పెంటయ్య
Editor Desk
రామన్నపేట, : ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఎన్నారం రూట్లోని నూతన బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని, కక్కిరేణి పల్లె దవాఖానకు ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు.
రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో విద్య, వైద్యం, స్థానిక సమస్యలపై సర్వే, పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ ప్రజలు ప్రశ్నిస్తేనే పాలనలో మార్పు వస్తుందని, సమస్యల పరిష్కారంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ఎన్నారం రూట్లో నిర్మించిన బ్రిడ్జి గత తొమ్మిదేళ్లుగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జిని వెంటనే అందుబాటులోకి తేవాలని అధికారులను కోరారు.
పల్లె దవాఖానలో కనీస వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్లూకోజ్, ఇంజెక్షన్లు, వెయిటింగ్ మెషిన్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రహరీ గోడ లేకపోవడంతో దవాఖాన ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని, వెంటనే గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.9 లక్షల
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి