పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలి: సర్పంచ్ వెంకటేశం
పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలి: సర్పంచ్ వెంకటేశం
Editor Desk
రామన్నపేట: మండలంలోని మునిపంపుల గ్రామంలో బొడ్రాయి నాలుగో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అర్చకుడు శ్రీనివాస్ శర్మ వేదమంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పులిహోర, పాయసం ప్రసాదంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్, గ్రామ పెద్దలు మామిడి పద్మారెడ్డి, మాజీ సర్పంచులు కూనూరు రాములమ్మ, రవికుమార్, కట్ట యాదయ్య, మామిండ్ల శేషాద్రి, ఉయ్యాల లక్ష్మీనర్సు, మన్నెం పద్మారెడ్డి, బూడిద నర్మద, యాదాసు శారద, నీల రజిత, మామిడి అంజిరెడ్డి, పాండురెడ్డి, తాళ్లపల్లి జితేందర్, తొలుపునూరి చంద్రశేఖర్, మామిళ్ల కుమారస్వామి, మేక మల్లారెడ్డి, ఉడతల శ్రీనివాస్, తాళ్ల వెంకటేశం, బూడిది మారయ్య తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి