మహబూబ్నగర్లో పీఐబీ ‘వార్తాలాప్’ వర్క్షాప్. ప్రభుత్వ పథకాల ప్రచారంలో మీడియా కీలకం: డీపీఆర్వో శ్రీనివాస్
మహబూబ్నగర్లో పీఐబీ ‘వార్తాలాప్’ వర్క్షాప్. ప్రభుత్వ పథకాల ప్రచారంలో మీడియా కీలకం: డీపీఆర్వో శ్రీనివాస్
Editor Desk
కృత్రిమ మేధ, డిజిటల్ మీడియా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యమిస్తూ బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని ప్రోత్సహించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డీపీఆర్వో) పీ. శ్రీనివాస్ సూచించారు. ‘12 ఏళ్ల విశ్వాసం–వికాసం–ప్రజా సంక్షేమం’ అంశంపై పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మహబూబ్నగర్లో నిర్వహించిన ‘వార్తాలాప్’ మీడియా వర్క్షాప్లో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. సమాచారాన్ని ప్రచురించే ముందు ధ్రువీకరించుకోవడం, వృత్తిపరమైన నైతిక విలువలను పాటించడం ద్వారా సమాజానికి మెరుగైన సేవ అందించవచ్చని అన్నారు.
పీఐబీ హైదరాబాద్ మీడియా, కమ్యూనికేషన్ అధికారి వర్గంటి గాయత్రి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో పీఐబీ వారధిగా పనిచేస్తోందన్నారు. విశ్వసనీయ సమాచారంతో ప్రజలు–ప్రభుత్వం మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు ముద్దం నరసింహస్వామి కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫ్యాక్ట్ చెక్ శిక్షకురాలు బీఎన్ సత్యప్రియ డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారాన్ని గుర్తించే పద్ధతులు, ఫ్యాక్ట్ చెకింగ్ అవసరంపై అవగాహన కల్పించారు.
సుమారు 140 మంది జర్నలిస్టులు పాల్గొన్న ఈ వర్క్షాప్లో సమాచార ప్రసారం, డిజిటల్ మీడియా ధోరణులు, వృత్తిపరమైన ప్రమాణాలపై చర్చించారు. పాత్రికేయుల సందేహాలకు నిపుణులు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న జర్నలిస్టులను డీపీఆర్వో పీ. శ్రీనివాస్ అభినందించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి