PRINT TIME: June 19, 2026 08:23 PM
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే వీరేశం పరామర్శ
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే వీరేశం పరామర్శ
June 19, 2026 06:44 PM
49 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, మండలంలోని సూరారం, తుర్కపల్లి గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సూరారం గ్రామానికి చెందిన బమిటిక శాంతమ్మ మృతిపై వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే తుర్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి