Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:34 PM

ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

  ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్
19-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.


ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవడంతో పాటు పాత సామగ్రి, ఉపయోగించని వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల కిచెన్‌షెడ్‌తో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. గ్రామాల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రత, ప్రజల్లో అవగాహన కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.


కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, ఎంపీడీవో, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

Article Image

యాదగిరిగుట్ట, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.


ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవడంతో పాటు పాత సామగ్రి, ఉపయోగించని వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల కిచెన్‌షెడ్‌తో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. గ్రామాల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రత, ప్రజల్లో అవగాహన కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.


కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, ఎంపీడీవో, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News