Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో టీఆర్ఎస్ జోష్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి భారీ చేరికలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 19, 2026 09:39 PM

ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

  ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్
June 19, 2026 08:13 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.


ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవడంతో పాటు పాత సామగ్రి, ఉపయోగించని వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల కిచెన్‌షెడ్‌తో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. గ్రామాల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రత, ప్రజల్లో అవగాహన కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.


కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, ఎంపీడీవో, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News