ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్
ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్
Editor Desk
యాదగిరిగుట్ట, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.
ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవడంతో పాటు పాత సామగ్రి, ఉపయోగించని వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల కిచెన్షెడ్తో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. గ్రామాల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రత, ప్రజల్లో అవగాహన కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, ఎంపీడీవో, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి