Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఎస్‌ఆర్ నివాసంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణుల సందడి ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 19, 2026 07:12 PM

బూత్‌లపై ఫోకస్.. సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి. నకిరేకల్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం

బూత్‌లపై ఫోకస్.. సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి. నకిరేకల్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం

బూత్‌లపై ఫోకస్.. సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి.  నకిరేకల్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం
June 19, 2026 04:54 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్,

పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలోని సువర్ణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. సభ్యత్వ నమోదును వేగవంతం చేయడంతో పాటు ఓటరు జాబితాలో అర్హుల పేర్లు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు లక్ష్యాలు, బూత్ స్థాయి బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ప్రజలకు చేరువై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జి గుజ్జ దీపికా–యోగేంద్ర, మాజీ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ బూత్‌ల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News