ఇంద్రపాలనగరం, గ్రామంలోని 4వ వార్డులో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారిన సమస్యకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శాశ్వత పరిష్కారం చూపించారు. ఎన్నికల ప్రచారం సమయంలో స్థానికుల నుంచి ఈ సమస్యను తెలుసుకున్న ఆయన, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయించారు.
అదేవిధంగా మారెమ్మ గుడి వద్ద కూలిపోయిన విద్యుత్ స్థంభాన్ని కూడా తిరిగి ఏర్పాటు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, ఇతర వార్డు సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి