658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్
658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జడ్జి ఎం. హిమబిందు ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పెండింగ్ కేసులను పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మొత్తం 658 కేసులు విజయవంతంగా పరిష్కారం అయినట్లు జడ్జి ఎం. హిమబిందు తెలిపారు. ప్రజలు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తమ వివాదాలను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. రాజీ మార్గంలో కేసుల పరిష్కారం వల్ల ఇరువర్గాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంతో పాటు న్యాయం త్వరితగతిన అందుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్సైలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి