Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:07 PM

658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్

658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్

658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్
20-06-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జడ్జి ఎం. హిమబిందు ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పెండింగ్ కేసులను పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మొత్తం 658 కేసులు విజయవంతంగా పరిష్కారం అయినట్లు జడ్జి ఎం. హిమబిందు తెలిపారు. ప్రజలు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తమ వివాదాలను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. రాజీ మార్గంలో కేసుల పరిష్కారం వల్ల ఇరువర్గాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంతో పాటు న్యాయం త్వరితగతిన అందుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్సైలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జడ్జి ఎం. హిమబిందు ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పెండింగ్ కేసులను పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మొత్తం 658 కేసులు విజయవంతంగా పరిష్కారం అయినట్లు జడ్జి ఎం. హిమబిందు తెలిపారు. ప్రజలు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తమ వివాదాలను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. రాజీ మార్గంలో కేసుల పరిష్కారం వల్ల ఇరువర్గాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంతో పాటు న్యాయం త్వరితగతిన అందుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్సైలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News