Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:49 PM

ఉద్యోగుల బదిలీల్లో సహకరించిన కలెక్టర్‌కు టీఎన్జీవో సన్మానం హెచ్‌ఆర్‌ఏ పెంపు, హాస్టళ్లకు నిధుల మంజూరుపై వినతి

ఉద్యోగుల బదిలీల్లో సహకరించిన కలెక్టర్‌కు టీఎన్జీవో సన్మానం హెచ్‌ఆర్‌ఏ పెంపు, హాస్టళ్లకు నిధుల మంజూరుపై వినతి

ఉద్యోగుల బదిలీల్లో సహకరించిన కలెక్టర్‌కు టీఎన్జీవో సన్మానం హెచ్‌ఆర్‌ఏ పెంపు, హాస్టళ్లకు నిధుల మంజూరుపై వినతి
June 20, 2026 12:49 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : సాధారణ బదిలీల ప్రక్రియలో ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ టీఎన్జీవో యూనియన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను సన్మానించారు.

ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి జే. శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు కల్పించాలని కోరారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

తాము కోరిన వెంటనే వెటర్నరీ సబ్‌సెంటర్లలో అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కూడా కలిసి పలు ఉద్యోగుల సమస్యలను వివరించారు.

కార్యక్రమంలో రాజు, నర్సింహాచారి, రణదేవ్, రమ్యసుధ, గోవర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, విజయకుమారి, భాస్కర్, సత్యనారాయణ, కాశీం, అజీముద్దీన్, సుమన్, దుర్గయ్య, వెంకటరమణ, శ్రీనివాస్, లక్ష్మి, యశ్వంత్, శంకర్‌రెడ్డి, సైదులు, సోమేశ్వరి, సునీత, విజయశాంతి, యూనస్, యాదమ్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News