Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:53 AM

ఉద్యోగుల బదిలీల్లో సహకరించిన కలెక్టర్‌కు టీఎన్జీవో సన్మానం హెచ్‌ఆర్‌ఏ పెంపు, హాస్టళ్లకు నిధుల మంజూరుపై వినతి

ఉద్యోగుల బదిలీల్లో సహకరించిన కలెక్టర్‌కు టీఎన్జీవో సన్మానం హెచ్‌ఆర్‌ఏ పెంపు, హాస్టళ్లకు నిధుల మంజూరుపై వినతి

ఉద్యోగుల బదిలీల్లో సహకరించిన కలెక్టర్‌కు టీఎన్జీవో సన్మానం హెచ్‌ఆర్‌ఏ పెంపు, హాస్టళ్లకు నిధుల మంజూరుపై వినతి
20-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : సాధారణ బదిలీల ప్రక్రియలో ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ టీఎన్జీవో యూనియన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను సన్మానించారు.

ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి జే. శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు కల్పించాలని కోరారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

తాము కోరిన వెంటనే వెటర్నరీ సబ్‌సెంటర్లలో అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కూడా కలిసి పలు ఉద్యోగుల సమస్యలను వివరించారు.

కార్యక్రమంలో రాజు, నర్సింహాచారి, రణదేవ్, రమ్యసుధ, గోవర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, విజయకుమారి, భాస్కర్, సత్యనారాయణ, కాశీం, అజీముద్దీన్, సుమన్, దుర్గయ్య, వెంకటరమణ, శ్రీనివాస్, లక్ష్మి, యశ్వంత్, శంకర్‌రెడ్డి, సైదులు, సోమేశ్వరి, సునీత, విజయశాంతి, యూనస్, యాదమ్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యోగుల బదిలీల్లో సహకరించిన కలెక్టర్‌కు టీఎన్జీవో సన్మానం హెచ్‌ఆర్‌ఏ పెంపు, హాస్టళ్లకు నిధుల మంజూరుపై వినతి

Article Image

నల్గొండ, : సాధారణ బదిలీల ప్రక్రియలో ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ టీఎన్జీవో యూనియన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను సన్మానించారు.

ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి జే. శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు కల్పించాలని కోరారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

తాము కోరిన వెంటనే వెటర్నరీ సబ్‌సెంటర్లలో అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కూడా కలిసి పలు ఉద్యోగుల సమస్యలను వివరించారు.

కార్యక్రమంలో రాజు, నర్సింహాచారి, రణదేవ్, రమ్యసుధ, గోవర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, విజయకుమారి, భాస్కర్, సత్యనారాయణ, కాశీం, అజీముద్దీన్, సుమన్, దుర్గయ్య, వెంకటరమణ, శ్రీనివాస్, లక్ష్మి, యశ్వంత్, శంకర్‌రెడ్డి, సైదులు, సోమేశ్వరి, సునీత, విజయశాంతి, యూనస్, యాదమ్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News