జీవి హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
జీవి హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
Harish K
కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జి వీ హాస్పిటల్ ను కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె హెల్త్ చెకప్ చేయించుకున్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..దిన దినాభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణానికి జీ వీ హాస్పిటల్ ఎంతో ఉపయోగకరం అన్నారు.కోదాడ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని డాక్టర్లకు యాజమాన్యానికి సూచించారు. పేదలకు అతి తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నారు.వైద్యులు సేవాభావంతో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, రాబోయే రోజుల్లో వైద్యం అంటే కోదాడ గుర్తుకు వచ్చేలా పనిచేయాలని గుర్తు చేశారు.జీవి హాస్పిటల్ లో అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో , కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, కాంగ్రెస్ నాయకులు ఎర్నేని బాబు , కారింగుల అంజన్ గౌడ్,అమీనాబాద్ మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు ,మున్సిపల్ కౌన్సి లర్లు,డాక్టర్ సుబ్బారావు, కోదాడ టౌన్ లో ఉన్న వివిధ హాస్పిటల్ డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి