Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:09 AM

కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి

కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి

కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి
22-06-2026 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఎం సీనియర్ నాయకుడు, ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ చెక్క పాపయ్యకు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవలే ఆయన కన్నుమూయగా, శనివారం గ్రామంలో సంతాప సభ నిర్వహించారు.

​ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా తదితరులు మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే కందాల రంగారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పాపయ్య, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, కార్మిక-కర్షక ఐక్యత కోసం చివరి శ్వాస వరకు పోరాడారని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని, పాపయ్య ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, ఎలుక రాజు యాదగిరి, ఆదిమూలం నందీశ్వర్, గరిశే నరసింహ, జక్కిడి రాంరెడ్డి, బోరం నర్సిరెడ్డి, చీమ కండ్ల శ్రీరాములు, తిగుల్ల రమేష్, చెరుకు అడవయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి

Article Image

సీపీఎం సీనియర్ నాయకుడు, ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ చెక్క పాపయ్యకు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవలే ఆయన కన్నుమూయగా, శనివారం గ్రామంలో సంతాప సభ నిర్వహించారు.

​ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా తదితరులు మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే కందాల రంగారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పాపయ్య, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, కార్మిక-కర్షక ఐక్యత కోసం చివరి శ్వాస వరకు పోరాడారని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని, పాపయ్య ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, ఎలుక రాజు యాదగిరి, ఆదిమూలం నందీశ్వర్, గరిశే నరసింహ, జక్కిడి రాంరెడ్డి, బోరం నర్సిరెడ్డి, చీమ కండ్ల శ్రీరాములు, తిగుల్ల రమేష్, చెరుకు అడవయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News