కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి
K.RAVI
సీపీఎం సీనియర్ నాయకుడు, ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ చెక్క పాపయ్యకు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవలే ఆయన కన్నుమూయగా, శనివారం గ్రామంలో సంతాప సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా తదితరులు మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే కందాల రంగారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పాపయ్య, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, కార్మిక-కర్షక ఐక్యత కోసం చివరి శ్వాస వరకు పోరాడారని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని, పాపయ్య ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, ఎలుక రాజు యాదగిరి, ఆదిమూలం నందీశ్వర్, గరిశే నరసింహ, జక్కిడి రాంరెడ్డి, బోరం నర్సిరెడ్డి, చీమ కండ్ల శ్రీరాములు, తిగుల్ల రమేష్, చెరుకు అడవయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి