Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:47 AM

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ
21-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌లో శనివారం ఘనంగా యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల వ్యాయామ విద్యా విభాగం, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) మరియు ఎన్‌సీసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా మాట్లాడుతూ నిత్య యోగాభ్యాసం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిరక్షించుకోవచ్చని అధ్యాపకులు, విద్యార్థులకు సూచించారు. అనంతరం గణితశాస్త్ర అధ్యాపకుడు, యోగా సాధకుడు ఎన్. నరసింహ వివిధ యోగాసనాలను ప్రదర్శించి, వాటి ప్రయోజనాలను వివరించారు.

కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత గైడెడ్ మెడిటేషన్, ప్రాణాయామం తదితర అంశాలపై అవగాహన కల్పించి, విద్యార్థులతో అభ్యాసం చేయించారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. డి. మధు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. ఇ. యాదగిరి రెడ్డి, డా. ఎస్. శారదా దేవి, లైబ్రేరియన్ డా. ఎ. దుర్గాప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

Article Image

హయత్‌నగర్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌లో శనివారం ఘనంగా యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల వ్యాయామ విద్యా విభాగం, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) మరియు ఎన్‌సీసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా మాట్లాడుతూ నిత్య యోగాభ్యాసం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిరక్షించుకోవచ్చని అధ్యాపకులు, విద్యార్థులకు సూచించారు. అనంతరం గణితశాస్త్ర అధ్యాపకుడు, యోగా సాధకుడు ఎన్. నరసింహ వివిధ యోగాసనాలను ప్రదర్శించి, వాటి ప్రయోజనాలను వివరించారు.

కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత గైడెడ్ మెడిటేషన్, ప్రాణాయామం తదితర అంశాలపై అవగాహన కల్పించి, విద్యార్థులతో అభ్యాసం చేయించారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. డి. మధు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. ఇ. యాదగిరి రెడ్డి, డా. ఎస్. శారదా దేవి, లైబ్రేరియన్ డా. ఎ. దుర్గాప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News