ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ
Editor Desk
హయత్నగర్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్నగర్లో శనివారం ఘనంగా యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల వ్యాయామ విద్యా విభాగం, జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) మరియు ఎన్సీసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా మాట్లాడుతూ నిత్య యోగాభ్యాసం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిరక్షించుకోవచ్చని అధ్యాపకులు, విద్యార్థులకు సూచించారు. అనంతరం గణితశాస్త్ర అధ్యాపకుడు, యోగా సాధకుడు ఎన్. నరసింహ వివిధ యోగాసనాలను ప్రదర్శించి, వాటి ప్రయోజనాలను వివరించారు.
కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత గైడెడ్ మెడిటేషన్, ప్రాణాయామం తదితర అంశాలపై అవగాహన కల్పించి, విద్యార్థులతో అభ్యాసం చేయించారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. డి. మధు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. ఇ. యాదగిరి రెడ్డి, డా. ఎస్. శారదా దేవి, లైబ్రేరియన్ డా. ఎ. దుర్గాప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి