Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్ పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 09:35 PM

ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లిటరసీ, ఏఐ శిక్షణతో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లిటరసీ, ఏఐ శిక్షణతో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లిటరసీ, ఏఐ శిక్షణతో నాణ్యమైన విద్య
June 20, 2026 08:18 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

డిజిటల్ లిటరసీ, ఏఐ కోర్సు శిక్షణ నైపుణ్యంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలో ఈఎంసీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 9,10 వ తరగతి తరగతి విద్యార్థుల కోసం ఈనెల 15 నుండి 20వ తేదీ వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక డిజిటల్ లిటరసీ, ఏఐ కోర్సు శిక్షణ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏఐ కోర్సు సిలబస్ పుస్తకాలతో కంప్యూటర్ ఆపరేటింగ్, చాట్ జిపిటి, ఏఐ స్కిల్స్ అప్లికేషన్, డిజైన్ థింకింగ్, మేకింగ్ ఆఫ్ కోడింగ్, పెయింటింగ్, విషయాలను విద్యార్థులు నేర్చుకోవడం వలన సబ్జెక్టు విషయాలకు అన్వయించుకుని, సాఫ్ట్వేర్ రంగంలో ఉజ్వల భవిష్యత్తును సాధించవచ్చునని పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులను ప్రత్యేకంగా కంప్యూటర్ విభాగంనకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులతో పరిశీలించి, ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసినారు. పాఠశాలలో జరుగుతున్న నూతన అడ్మిషన్ల డెస్క్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ సంతోష్ కిరణ్, ఎంఈఓ సలీం షరీఫ్, పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు డి. మార్కండేయ, డిజిటల్ లిటరసీ, ఏఐ శిక్షణ మాస్టర్స్ ధీరజ్, రవితేజ, నాని, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News